'మై డియర్ మార్తాండం' ట్రైలర్

SMTV Desk 2018-12-26 14:28:23  krishna bhagawan,prudhvi raj, rakendhu maouli, kalpika,harish k.v,tagubpthu ramesh

హైదరాబాద్ , డిసెంబర్ 26 : కిర్రాక్ పార్టీ ఫేమ్ సింగర్ రాకేందు మౌళి, కల్పిక జంటగా హరీష్ కె .వి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మై డియర్ మార్తాండం' . ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసి దాదాపు 5నెలలు అయింది, కాగా తాజాగా రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేశారు.



30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ , కృష్ణ భగవాన్,జయప్రకాష్ రెడ్డి , తాగుబోతు రమేష్ వంటి కామెడియన్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు . కామెడీ ఫ్లేవర్ ఎక్కువగా ఉన్న ఈ ట్రైలర్ లో హీరో రాకేందు మౌళి అనుకోకుండా ఇరుక్కున్న కేసు ని వాదించే లాయర్లుగా పృథ్వి రాజ్ , కృష్ణ భగవాన్, తాగుబోతు రమేష్ కనిపించగా జేపీ జడ్జిగా ఉన్నారు. పృథ్వి రాజ్ వొక చేతగాని లాయర్ గా కేసును వాదించడానికి 30 రోజుల లో లాయర్ అవ్వడం ఎలా ?" అనే పుస్తకాన్ని చదవడం , కోర్టులో అసందర్భంగా చెప్పే డైలాగులు , చివరిలో కృష్ణభగవాన్ తో ఛాలెంజ్ మొదలయివి ట్రైలర్ కి ఆకర్షణగా ఉన్నాయి .

లా లెర్నింగ్ బాచిలర్ అనే టాగ్ తో వస్తూ కమెడియన్లతో కలిసి మనల్ని గిలిగింతలు పెట్టడానికి ఈ నెల 29 న విడుదల చేస్తూ మనముందుకు తేవడానికి చిత్ర యూనిట్ సిద్దమయ్యారు. కథ రొటీన్ అవ్వోచ్చేమోగాని కామెడీ మాత్రం పక్కా అనే ఫీల్ మనకి కలిగించేలాగా ఉంది ఈ ట్రైలర్.