అమరావతి, డిసెంబర్ 26: వంగవీటి రాధా వైసీపీ ని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారు అని ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుత పరిస్తితిని బట్టి చూస్తే రాధా, జగన్ కి హ్యాండ్ ఇచ్చేలా వున్నాడు అని తెలుస్తుంది. ఈ రోజు వంగవీటి మోహన రంగ 30వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని అభిమానులను కోరారు. తన తండ్రి పేద ప్రజల శ్రేయస్సుకి సహకరించారని తాను కూడా అదే బాటలో నడుస్తానని అన్నారు.
అయితే తమ సొంతూరు కాటూరులో స్మృతి స్థూపం నిర్మాణానికి ఈ రోజు వంగవీటి రాధా శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం తన అభిమానులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా కదిలివెళ్లారు. ఇక్కడి వరకు కార్యక్రమం బాగానే జరిగింది కానీ ఇక్కడే సందేహాలు కూడా మొదలయ్యాయి. సాధారణంగా ఏ కార్యక్రమం చేపట్టినా కార్యకర్తల చేతుల్లో పార్టీ జెండాలు కనిపిస్తాయి. కానీ ఈ ర్యాలీలో ఎక్కడా కూడ కనీసం వొక్క వైసీపీ జెండా కనిపించలేదు. దీంతో వంగవీటి రాధా పార్టీ మారడం కాయమంటూ ప్రచారం మొదలైంది. విజయవాడ సెంట్రల్ సీటు తనకు ఇస్తారని ఎదురుచూసిన రాధకు నిరాశ ఎదురైంది. ఆ టికెట్ ని తనకి కాకుండా విష్ణుకి కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న రాధా పార్టీ మారడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.