కలకత్తా, డిసెంబర్ 26: ప్రస్తుతం జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ ఆరో సీజన్ లో తెలుగు టైటాన్స్ పని అయిపోయందని తెలుస్తుంది. ఇప్పటికే తమ పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్షిస్టం చేసుకున్న తెలుగు టైటాన్స్ మంగళవారం రాత్రి జరిగిన టైటాన్స్ చివరి లీగ్ మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. దీంతో పూర్తిగా ప్లే ఆఫ్ రేస్ కు దూరం అయింది. బెంగాల్ జట్టు చేతిలో 34-39 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది.
ప్రథమార్ధంలో 13-23తో వెనుకబడ్డ టైటాన్స్ ద్వితీయార్ధంలో అంతగా పుంజుకోలేదు. అయితే చివరి నిమిషాల్లో టైటాన్స్ జట్టు ఆటగాళ్లు దూకుడుగా ఆడి పాయింట్లు సాధించారు. అయితే ప్రత్యర్థికి చేరువగా వచ్చినప్పటికీ దాని స్కోరును మాత్రం అందుకోలేకపోయింది. చివరికి ఈ సీజన్ లో చివరి మ్యాచ్ ను ఓటమితో ముగించింది.