యాదద్రిలో పోటెత్తిన భక్తులు

SMTV Desk 2018-12-25 19:40:39  Yadadri, Devotees, Governament Holidays

యాదాద్రి, డిసెంబర్ 25: ప్రభుత్వం నుండి వరుస సెలవులు రావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు మొత్తం భక్తులతో నిండిపోయింది. ఆలయంలో సాదారణ దర్శనానికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. కాగా ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతుంది. ఆలయంలో, పరిసరాల్లో భక్తుల రద్దీ కారణంగా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.