క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ విజయమ్మ

SMTV Desk 2018-12-25 16:45:32  YSRCP, YS Vijayamma, YS Rajashekar reddy, YS Jagan mohan reddy, Christamus celebrations

పులివెందుల, డిసెంబర్ 25: క్రిస్మస్ పర్వదిన సందర్భంగా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ విజయమ్మ కోడలు భారతితో కలిసి చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేవుడు జగన్ పక్షాన ఉన్నాడని తనకు దేవుడు మంచి భర్త, మంచి కుటుంబాన్ని ప్రసాదించాడని తెలిపారు. తన భర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి పరిపాలన చేసేలా శక్తిని దేవుడు ఇచ్చాడని ఆమె అన్నారు. దేవుడి ఆశీర్వాదం కారణంగానే ఆయన కోల్లాది మంది ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అభిప్రాయపడ్డారు.

ఇటీవల జగన్ పై హత్యాయత్నం జరగగా దేవుడి కృప కారణంగా బయటపడ్డాడని ఆమె అన్నారు. దేవుడు జగన్ పక్షాన ఉన్నాడని వైఎస్ లాగానే జగన్ తో కూడా ప్రజలు సేవ చేయించుకోవాలని దేవుడు భావిస్తున్నాడని ఆమె చెప్పారు. పాదయాత్రలో జగన్ కి నిత్యం దేవుడు తోడుగా ఉండి కాపాడుతున్నాడన్నారు. జగన్ లక్ష్యాన్ని దేవుడు త్వరలోనే నెరవేరుస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.