ఆసిఫాబాద్, డిసెంబర్ 25: దేశ రక్షణ కోసం జమ్మూ కశ్మీర్లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసి తన ప్రాణాల్ని మాతృ భూమికి అర్పించాడు. వివారాల ప్రకారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లికి చెందిన దక్వా రాజేష్ శ్రీనగ్ర్లో ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో రాజేష్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాజేష్ స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జమ్మూ కశ్మీర్లో గత కొంతకాలంగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రానికి రాజేష్ మృతదేహం స్వగ్రామానికి చేరే అవకాశం ఉందని బంధువులు తెలిపారు.