కోర్టు దగ్గర ఓ మహిళా కలకలం

SMTV Desk 2017-07-27 12:31:25  nallagonda, women, bulding, sucaid,atemptu

నల్గొండ, జూలై 27 : నల్గొండ కోర్టు దగ్గర ఓ మహిళా కలకలం సృష్టించింది. నల్గొండ జిల్లా సముదాయంలో ఓ భవనంను కొత్తగా నిర్మిస్తున్నారు. నల్గొండకు చెందిన లక్ష్మి అనే మహిళా ఆ బిల్డింగ్ పైకి ఎక్కి తనకు న్యాయం జరగకపొతే చనిపోతానని బెదిరిస్తుంది. ఆమెకు సంబంధించిన అరెకరం భూమిని బంధువులు అక్రమంగా లాక్కున్నారని దీనిపై ఆర్డీఓ కు, కలెక్టర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన న్యాయం జరుగకపోవటంతో ఈ బిల్డింగ్ పైకి ఎక్కి చనిపోతానని బెదిరిస్తుంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.