శ్రీశైలం, డిసెంబర్ 25: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో తాంత్రిక పూజలు జరుగుతున్నాయనే వార్తలు ఆ ప్రాంత ప్రజలను భయాందోలనకు గురి చేస్తున్నాయి. ఇదివరకు విజయవాడ, సింహాచలం ఆలయాల్లో తాంత్రిక పూజల ఘటనలు మరవకముందే మల్లీ ఇప్పుడు ఈ ఆలయంలో జరగడం ఆశ్చర్యంగా ఉందంటూ అక్కడి ప్రజలు చెపుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ప్రధాన ఆలయానికి సమీపంలో తాంత్రిక పూజలు జరిగినట్లు వార్తలు రావడంతో దేవస్థాన అధికారులు అప్రమత్తమయ్యారు. తాంత్రిక పూజలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కోన్న ఆలయ వేదపండితుడు గంటి రాధాకృష్ణపై విచారణ జరిపిన ఈవో ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.