మొబైల్‌ క్యాన్సర్‌ వ్యాన్ ని ప్రారంభించిన రాజమహేంద్రి ఎం. పి

SMTV Desk 2018-12-24 19:13:43  maganti murali mohan, rajamundry mp,tdp mp,mobile cancer van

రాజమండ్రి, డిసెంబర్ 24 : రాజమహేంద్రవరం (రాజమడ్రి) యం.పి శ్రీ మాగంటి మురళి మోహన్ గారు మొబైల్‌ క్యాన్సర్‌ వ్యాన్ ని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో పూజ చేసి ప్రారంభించారు. తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఎం.పీ గారు ‌ మాట్లాడుతూ క్యాన్సర్ సంచార వాహనంతో పాటుగా జిఎస్ఎల్ హాస్పిటల్ వారి సంచార దంతవైద్య వాహనం అన్ని మండల కేంద్రంలో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు .కావున ప్రజలు అందరు ఈ సద అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని కోరారు.

ఈ కార్యక్రమంలో గూడా చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ గారు ,మేయర్ శ్రీమతి పంతం రజిని శేష సాయి గారు, డిప్యూటీ మేయర్ శ్రీ వాసిరెడ్డి రాంబాబు గారు, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ శ్రీరమేష్ కిషోర్ గారు , జిఎస్ఎల్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ గన్ని భాస్కర్ రావు మరియు కార్పేరేటర్లు, తెలుగు దేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.