నల్గొండ, డిసెంబర్ 24: జిల్లాలోని నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో తెరాస నేత, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి టీఅరెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రసంశల వర్షం కురిపించారు. దేశ ప్రజలంతా కేసిఆర్కు నీరాజనాలు పడుతున్నారని ,కేసిఆర్ లాంటి దార్శనికత ఉన్న వ్యక్తి, ఆయన ముందుచూపుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మాట్లాడారు.
అలాగే కేసిఆర్ ఫెడరల్ పర్యటనకు దేశ ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు. కేసిఆర్ నాయకత్వంలో దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో వచ్చే అన్ని ఎన్నికల్లో గులాబి జెండా రెపరెపలాడుతుందన్నారు.