హైదరాబాద్ మే 31: గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ న్యాయస్థానం కేంద్రానికి సూచించింది. ఈ మేరకు హైకోర్టు కీలక సూచనలు చేస్తూ మాంసం కోసం పశువుల అమ్మకాల నిషేధంపై దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆవుల సంరక్షణపై వివిధ చర్యలను చేపట్టడానికి పలు చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఎలాగైనా గోవును రక్షించడం కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తున్న సమయంలో ఈ మేరకు సూచనలు చేసింది.