హైదరాబాద్, డిసెంబర్ 24: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ తాజాగా కేరళలోని శబరిమల ఆలయానికి వెళ్ళే భక్తుల కోసం బస్సులను సిద్ధం చేసింది. అనుభవజ్ఞులైన డ్రైవర్లతో మొత్తం 5 రకాల బస్సులను అందుబాటులో ఉంచింది. 47 సీట్ల సామర్ధ్యం గల వోల్వో బస్సుతో పాటు…15 సీట్ల మిని బస్సులు అందుబాటులో ఉన్నాయి. బస్సులనే కాక ఏసి ఇన్నోవాలు కూడా అద్దెలకు పర్యాటకాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. వివరాలకు హైదర్గూడలోని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని కోరుతున్నారు. రైలు టికెట్లు దొరక్క ఇబ్బందిపడే భక్తులకు ఈ సౌకర్యం ఉపకరిస్తుందని పర్యాటకాభివృద్ది సంస్థ ఎండి మనోహర్ తెలిపారు.