పట్నా, జూలై 27 : నేడు బిహార్ రాష్ట్ర సీఎంగా నితీశ్కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయించారు. 2015లో ఆర్జేడీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ బుధవారం ఆకస్మాతుగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ని రాజీనామా చేయించాలన్న ప్రయత్నం ఫలించకపోవడంతో నితీశ్ ఆకస్మాత్తుగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన సమర్పించిన రాజీనామాను గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి ఆమోదించి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. ఆ వెంటనే పాత మిత్రునితో మూడేళ్ల తరువాత జత కట్టేందుకు భాజపా తెరపైకి రావడంతో చకచకా మంతనాలు సాగి అర్థరాత్రికి ఓ స్పష్టత వచ్చింది. దీంతో భాజపా మద్దతుతో నితీశ్ ఆరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీఎం తో పాటుగా డిప్యూటీ సీఎంగా సుశీల్ కుమార్ మోదీ ప్రమాణస్వీకారం చేశారు.