భువనేశ్వర్, డిసెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్ర శేకర్ రావు కుటుంబసభ్యులతో ఈ రోజు విశాఖపట్నం చేరుకున్నారు. అనంతరం శారద పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వొడిశా రాజధాని భువనేశ్వర్ కు పయనమయ్యారు. కొద్దిసేపటి క్రితం అక్కడి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. కేసిఆర్ను చూసేందుకు ఎయిర్పోర్టుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు వొడిశా సియం నవీన్ పట్నాయక్ నివాసంలో బిజెడి అధినేతతో కేసిఆర్ భేటి కానున్నారు. ఈ సమావేశంలో ఫెడరల్ ఫ్రంట్పై చర్చించనున్నారు. ఇవాళ రాత్రి వొడిశా సియం అధికార నివాసంలో బస చేస్తారు. రేపు ఉదయం కోణార్క్ దేవాలయాన్ని, తర్వాత పూరీ జగన్నాథుని దర్శించుకుని సాయంత్రం కోల్కత్తాకు వెళ్లనున్నారు.