ఎట్టకేలకు ఈడీ కస్టడీకి కాశ్మీర్ వేర్పాటువాది

SMTV Desk 2017-07-27 11:27:04  Shabir shaa, kasmir activitist,dhelli court

న్యూఢిల్లీ, జూలై 27: ఉగ్రవాదులకు నిధులు ఏర్పాటు చేసిన కేసులో దశాబ్ది కాలం క్రితం అరెస్ట్ వారెంటు జారీ చేసినప్పటికీ తప్పించుకు తిరుగుతున్న కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షాబీర్‌షాను ఈడీ అధికారులు బుధవారం కోర్టుముందు ప్రవేశపెట్టారు. ఇప్పటికే చాలా సార్లు నోటీసులు జారీచేసిన ఆయన విచారణకు హాజరుకాలేని కారణంగా ఇటీవల ఢిల్లీ అదనపు సెషన్స్ న్యాయస్థానం ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈమేరకు ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సిద్ధార్థ్ శర్మ ఏడు రోజుల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీ విధించారు.