ఇష్టంలేని పెళ్లి చేసుకుందని కాల్చి బూడిద చేశారు

SMTV Desk 2018-12-23 15:38:54  Mancheriyal, Jannaram, Kalamadugu, Love marrige, Murder

మంచిర్యాల, డిసెంబర్ 23: జన్నారం మండలం కలమడుగు గ్రామంలో ఓ యువతి తను ప్రేమించిన యువకుడితో తల్లితండ్రులకి వ్యతిరేఖంగా పెళ్లి చేసుకుందని తనని కొట్టి చంపి మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారు తన కుటుంబసభ్యులు. పోలీసుల వివరాల ప్రకారం కలమడుగుకు చెందిన అనురాధ, లక్ష్మణ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ జంట పెద్దలను ఎదిరించి ఈ నెల 3న హైదరాబాద్‌లోని ఆర్యసమాజంలో వివాహం చేసుకున్నారు. అనురాధ కుటుంబం కంటే లక్ష్మణ్ తక్కువ కులానికి చెందినవాడని భావిస్తున్నారు. వివాహం జరిగినప్పటి నుంచి అనురాధ కుటుంబసభ్యులు కొద్దిరోజులుగా భార్యాభర్తలను వెంబడిస్తున్నారు. ప్రేమ వివాహం సహించని తల్లిదండ్రులు ఆమెపై కక్ష పెంచుకున్నారు. కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుందని అనురాధపై పగ పెంచుకున్నారు.

నాలుగు రోజుల క్రితం నూతన దంపతులు కలమడుగుకు చేరుకున్నారు. వరుడు ఇంటికి వచ్చిన అనురాధను ఆమె తల్లిదండ్రులు శనివారం ఇంటికి పిలిపించుకున్నారు. నిన్న రాత్రంతా ఆమెను కుటుంబసభ్యులు చితకబాదారు. కుటుంబసభ్యులకు గ్రామస్తులు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. మృతురాలి తండ్రి సత్తయ్య, సోదరుడు మహేష్ అనురాధ చితకబాదినట్లు స్ధానికులు చెబుతున్నారు. దెబ్బలు తాకలేక అనురాధ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె శవాన్ని తమ స్వంత పొలంలో సజీవ దహనం చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.