తెలంగాణ ఎఫెక్ట్ కి.. కర్ణాటకలో పదవి కోల్పోయిన కాంగ్రెస్ నేత.!

SMTV Desk 2018-12-22 16:46:22   DK Shivakumar, HK Patil, Karnataka, Congress , New campaign committee Chairman

కర్ణాటక, డిసెంబరు 22: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి నుంచి డీకే శివకుమార్ ను తప్పించి, ఆ స్థానంలో మాజీ మంత్రి హెచ్ కే పాటిల్ ను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ ప్రెస్ రిలీజ్ చేసారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనుమతితోనే ఈ మార్పు జరిగినట్టు లేఖలో పేర్కొన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో, జేడీఎస్ తో కూటమి ఏర్పాటు చేయడంలో శివకుమార్ ప్రధానపాత్రను పోషించారు. ట్రబుల్ షూటర్ గా పేరున్న శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆయనపై నమ్మకంతో తెలంగాణ ఎన్నికల రంగంలోకి కూడా ఆయనను పార్టీ హైకమాండ్ దించింది. తెలంగాణలో అసంతృప్తులను బుజ్జగించడం దగ్గర నుంచి, వ్యూహాలను రచించడం వరకు ఆయన కీలకంగా వ్యవహరించారు. అయితే, ఆయన వ్యూహాలు ఇక్కడ ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే, ప్రచార కమిటీ బాధ్యతల నుంచి ఆయనను తప్పించినట్టు భావిస్తున్నారు.