ఖమ్మం, డిసెంబర్ 22: తెలంగాణ రాష్ట్ర ముందస్తు ఎన్నికల్లో ఖమ్మం జిల్లా అశ్వరావు పేట నియోజకవర్గం నుండి మచ్చా నాగేశ్వరరావు టిడిపి నుండి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈయన ఈ నెల 26 తర్వాత టిఆర్ఎస్ లోకి మకాం మారుస్తున్నారని అని పలు వర్గాలు చెప్పుకుంటున్న విషయం పై తాజాగా స్పష్టం చేశారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన టిడిపిని వీడే ఆలోచన లేదని ఆయన చెప్పారు.