చెన్నై, డిసెంబర్ 22 :వివిధ భాషలకి చెందిన చిత్రపరిశ్రమలలో మీటూ ఉద్యమం జోరుగా జరుగుతోంది. ఈ విషయంపై ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కోలీవుడ్లో చిన్మయి,వైరముత్తు వివాదం అందరికీ తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ, మీటూ ఉద్యమంపై స్పందన ఏమిటనే ప్రశ్న ప్రముఖ నటుడు అరవింద స్వామికి ఎదురైంది.
ఆ ప్రశ్నపట్ల ఆయన చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తూ "ప్రస్తుతం ప్రతి వొక్కరికి సోషల్ మీడియా అందుబాటులో వుంది. ఎవరి అభిప్రాయాలను వాళ్లు వ్యక్తం చేసే హక్కు ,అవకాశం రెండూ వున్నాయి. అయితే వాటిని పబ్లిసిటీ పొందడానికి వాడుకోకూడదు. వొక వ్యక్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు, ఏ సమాచారం లేకుండా నేను ఎలా తిట్టగలను? కేవలం ఎవరో వొకరు చేస్తోన్న ఆరోపణలను ఆధారంగా చేసుకుని మరొకరిని నేను ఎలా నిందించగలను? వొక్క మాటలో చెప్పాలంటే ఇది పర్సనల్ సమస్య దీనికి నా స్పందన అడగడం కరెక్ట్ కాదు" అని అన్నారు.