హైదరాబాద్ , డిసెంబర్ 22 : ఇన్నాళ్లు అమెరికాలో హెచ్ 1 బి వీసా సమస్యల మీద పోరాటంలో బిజీగా గడిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు అతని మూడో భార్య స్వస్థలం యూరప్ పర్యటనకు వెళ్లారు. పవన్ అన్నా లెజనోవా కి పుట్టిన శంకర పవనోవిచ్ కు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం చేయాల్సి ఉన్న కొన్ని తంతులను ఈ క్రిస్మస్ సందర్భంగా చేయడానికి పవన్ ను ఆయన భార్య కోరింది . ఈ నేపథ్యంలో, కుటుంబంతో కలసి ఆయన బయల్దేరాడు . క్రిస్మస్ అయ్యిన తర్వాత వారు మళ్లీ హైదరాబాదుకు తిరిగొస్తారు. యూరప్ పర్యటన తర్వాత అమరావతిలో పార్టీ శ్రేణులకు ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని ట్విట్టర్ లో చెప్పాడు.
కుటుంబంతో కలసి యూరప్ వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు pic.twitter.com/U1ajdGZBjp
— JanaSena Party (@JanaSenaParty) December 22, 2018