హైదరాబాద్,డిసెంబర్ 22 : రోబో 2.ఓ అందించిన విజయంతో సూపర్ స్టార్ రజనీకాంత్ మాంచి జోష్ మీద ఉన్నారు. తాజాగా తరవాత సినిమా పెట్టా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ సైలెంట్ గా కటుుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లిపోయారు. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసమే రజనీ అమెరికా వెళ్లారని రజనీ సన్నిహిత వర్గాలు స్పందించి వివరణ ఇచ్చాయి.
గతంలోనూ రజనీ తరచుగా అమెరికాలో ఆరోగ్య పరీక్షలు చేయించుకునేవారనీ, కానీ రోబో 2.ఓ షూటింగ్ కారణంగా అది కుదరక పోవడంతో ఇప్పుడు వెళ్లారని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి 10 వరకూ రజనీ అమెరికాలోనే గడపనున్నారు. అభిమానులు కంగారు పడాల్సిన విషయం ఏమీలేదని తేల్చిచెప్పారు. ఆయన భారత్ కు తిరిగివచ్చాక మురుగదాస్ దర్శకత్వంలో 2019, మార్చి నుంచి కొత్త సినిమా మొదలుకానుంది.