బీజేపీ, కాంగ్రెస్‌ ర్యాలీలలో ఉద్రిక్తత.!

SMTV Desk 2018-12-22 15:07:45   Goa, Panaji, BJP, Congress, Clash Between Two Groups

పనాజీ, డిసెంబర్ 22: గోవా రాజధాని పనాజీలో బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇటీవల రాఫెల్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేస్తూ.. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పనాజీలో బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు. కాగా, అదే సమయంలో రాఫెల్‌ కుంభకోణంపై కాంగ్రెస్‌ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ర్యాలీని చేపట్టింది. ఇరువర్గాలు ఎదురుపడటంతో, వొకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకోవడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.