నేడు రెండు జిల్లాల్లో జయప్రకాశ్‌నారాయణ్‌ పర్యటన

SMTV Desk 2018-12-22 13:23:19  Loksatta party, Dr.Jayaprakash narayan, Karimnagar, Warangal

హైదరాబాద్, డిసెంబర్ 22: ఈ రోజు వరంగల్‌ అర్బన్‌, కరీంనగర్‌ జిల్లాల్లో లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్‌ జయప్రకాశ్‌నారాయణ్‌ పర్యటించనున్నారు. ఈమేరకు హైదరాబాద్‌లోని లోక్‌సత్తా పార్టీ కార్యాలయం శుక్రవారం వొక ప్రకటనలో ఈవిషయాన్ని తెలిపింది.

ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 22వ తేదీ ఉదయం 9.20 గంటలకు వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన హన్మకొండలోని కల్యాణి హాస్పిటల్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని మీడియా సమావేశం అనంతరం అవినీతిపై నిఘా పెట్టి అక్రమార్కుల ఉప్పందిస్తున్న విజిల్‌ బ్లోయర్లను సత్కరిస్తారు.

లోక్‌సత్తా పార్టీ కార్యక్రమాలపై ఆ పార్టీ నేతలతో చర్చ జరిపి ఉదయం 10.30 గంటలకు కరీంనగర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ పట్టణంలోని ఫిల్మ్‌భవన్‌లో మీడియాతో సమావేశం నిర్వహించిన తదుపరి లోక్‌సత్తా వాలంటీర్లతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1.30 గంటకు కరీంనగర్‌ సమీపంలోని చొప్పదండిలో ఉన్న జిల్లా పరిషత్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో నదిశ ఫౌండేషన్‌ నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తారు.