భద్రాద్రిలో మావోయిస్టుల కలకలం

SMTV Desk 2018-12-22 13:04:02  Telangana, Bhadradri, Maoists, Posters, Former MLA Payam venkateshwarlu

భద్రాద్రి, డిసెంబర్ 22: జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మణగూరు మండలం తిర్లపురంలో మావోయిస్టుల పేరుతో కొన్ని పోస్టర్లు వెలిశాయి. థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు భూనిర్వాసితులను ఆదుకోవాలని, మాజీ ఎమ్యెల్యె పాయం వెంకటేశ్వర్లు అనుచరుల అరాచకాలను అడ్డుకోవాలంటూ మావోయిస్టులు పోస్టర్లను అంటించారు. మావోల పోస్టర్లతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.