సిమ్లా, డిసెంబర్ 22: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హిమాచల్ప్రదేశ్ సిమ్లాలో విహారయాత్రలో బిజీగా ఉన్నారు. తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో క్షణం కూడా తీరిక లేకుండా గడిపిన ఆయన రాజకీయాలకు కొన్ని రోజులు సెలవు ప్రకటించారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా హిమాచల్ప్రదేశ్ వెళ్లిన ఆయన సిమ్లాలో సేద తీరుతున్నారు.
ఈ క్రమంలో సిమ్లాలో దివ్యాంగుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కాసేపు చెస్ ఆడుతూ ముచ్చటించారు. సిమ్లాలో నిర్మిస్తున్న ఆయన సోదరి ప్రియాంక వాద్రా ఇంటిని రాహుల్ పరిశీలించారు. సిమ్లా వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో రాహుల్ ఓ దాబా వద్ద ఆగినప్పుడు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయనను కలుసుకున్నారు.