ఘోర రోడ్డు ప్రమాదం

SMTV Desk 2017-07-26 19:01:12  road, accident, bike, at, tree

రాజన్న సిరిసిల్ల, జూలై 26 : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ళ వద్ద చోటు చేసుకుంది. పోలిసుల కథనం ప్రకారం... విద్యార్ధులు ద్విచక్ర వాహనంపై సిద్దిపేట నుంచి సిరిసిల్లకు వెళ్తుండగా వాహనం చెట్టుకు డీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన విద్యార్ధులు సిరిసిల్ల కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.