న్యూఢిల్లీ, డిసెంబర్ 21: సివిల్స్ మెయిన్స్ 2018 పరీక్షల ఫలితాలను యూపీఎస్సి గురువారం విడుదలచేసింది. 2018 సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 7 వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఇంటర్వ్యూలకు దేశవ్యాప్తంగా 1994 మందిని ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 100 మందికి పైగా ఎంపిక అయినట్లు సమాచారం. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 4 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఐఏఎస్ ,ఐపీఎస్,ఐఎఫ్ఎస్ తదితర సర్వీసుల్లోని 782 పోస్టుల కోసం యూపీఎస్సీ పరీక్ష నిర్వహించగా, దాదాపు మూడు లక్షలకు పైగా అభ్యర్థులు ప్రీలిమ్స్ కు హాజరు అయ్యారు. వారిలో సుమారు 10,500 మంది మెయిన్స్ పరీక్షకు అర్హులు అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 900 కి పైగా హాజరు అయినట్లు తెలుస్తుంది.