హైదరాబాద్, జూలై 26 : భాజపా కార్యాలయంలో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మాజీ సైనికుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. అనంతరం పలువురు మాజీ సైనికులను సత్కరించి, భాజపా నాయకత్వానికి సైనికులంటే ఎనలేని గౌరవం ఉందన్నారు. కాని మాజీ సైనికుల విషయంలో ఇళ్ల స్థలాల మంజూరుతో పాటు మరికొన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ తన బుద్ధి మార్చుకోకపోతే ఆ దేశంపై బాంబులతో దాడి చేస్తామంటూ హెచ్చరించారు. గతంలో ఆ దేశ చెలిమి కోసం మాజీ ప్రధాని వాజ్పేయి ప్రయత్నిస్తుండగా కార్గిల్ను ఆక్రమించుకునే ప్రయత్నం చేసిందని గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ మాత్రమే కాకుండా కయ్యానికి కాలు దువ్వితే చైనా సైతం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు.