2018 సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల ఫలితాలు విడుదల

SMTV Desk 2018-12-20 20:34:48  2018 Civils, Union public service comission, Exams results,

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 20: 2018 సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ విడుదల చేసింది. 1994 మంది అభ్యర్థులు ఈ అత్యున్నత సర్వీసులకు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు upsc.gov.in, upsconline.nic.in వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. మెయిన్స్ పరీక్షలు 2018 సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఐఏఎస్, ఐపీఎస్‌ సర్వీసెస్‌తో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో ఉద్యోగాల నియామకాల కోసం మెయిన్స్ పరీక్షను నిర్వహించారు. మెయిన్స్ పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి పర్సనాలిటీ టెస్ట్ లేక ఇంటర్వ్యూ నిర్వహిస్తామని కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది