లోక్‌సభలో ఈ నెల 27న ట్రిపుల్‌ తలాక్‌పై చర్చ

SMTV Desk 2018-12-20 20:33:52  Trippile talaq, Loksabha, Ravi shankar prasad, Muslim women protection, Copngress, Mallikarjuna kharge, Sumitra mahajanan, NK Prem chandan

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 20: లోక్‌సభలో ఈ నెల 27న వివాదాస్పదంగా మారిన ట్రిపుల్‌ తలాక్‌పై చర్చ జరగనుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ముస్లిం వుమెన్‌ ప్రొటెక్షన్‌ బిల్లుపై చర్చించాలని కాంగ్రెస్‌ ఎంపి మల్లికార్జున ఖర్గే ఇవాళ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కోరారు.

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై అభిప్రాయాలు వెలిబుచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఆ సమయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందించారు. సభ శాంతియుతంగా జరిగేందుకు అవకాశం ఇస్తే, కచ్చితంగా ట్రిపుల్‌ తలాక్‌పై చర్చిస్తామన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై వ్యతిరేకంగా తీర్మానాన్ని వేయాలని నిర్ణయించినట్లు ఎంపి ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌ తెలిపారు.