చెన్నై, డిసెంబర్ 20: రాష్ట్రంలోని సేలం సమీపంలో పదో తరగతి కుర్రాడితో పెళ్లై పది రోజులు కూడా కాని వధువు పారిపోయింది. పోలీసుల వివరాల ప్రకారం తమిళనాడులోని సేలం తిరువాగౌండనూరుకు చెందిన 26 ఏళ్ల మహిళ ప్రైవేట్ ట్యుటోరియల్లో టీచర్గా పనిచేస్తోంది. ఆమెకు బాగల్పట్టికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్తో గత నెల 19వ తేదీన వివాహం జరిగింది. వివాహమైన వారం తర్వాత భర్త చెన్నైలో ఉద్యోగం చేసేందుకు వెళ్లాడు.
దీంతో ఆ టీచర్ పుట్టింటికి వెళ్లింది. పుట్టింటికి సమీపంలోని ఓ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి వస్తానని చెప్పిన ఆ మహిళ ఇంటికి తిరిగి రాలేదు. నాలుగు రోజులుగా ఎంత వెతికినా కూడ ఆమె ఆచూకీ లభించలేదు. నాలుగు రోజుల తర్వాత పదో తరగతి విద్యార్థితో కలిసి డిసెంబర్ 18వ తేదీన ఆమె తమ ఇంటికి సమీపంలోని పోలీస్ స్టేషన్కు వచ్చింది.
పదో తరగతి విద్యార్థితో కలిసి తాను జీవిస్తానని ఆమె పోలీసులకు తేల్చి చెప్పింది. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. బాలుడికి కూడ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ బాలుడిని పోలీసులు తల్లిదండ్రుల వెంట పంపారు.