జనగామ, డిసెంబరు 20: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనగామ జిల్లాలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గెలుపులో పాఠాలు ఉంటే.. ఓటమిలో గుణపాఠాలు ఉంటాయని అన్నారు. గెలవగానే పొంగిపోవద్దు, అహంకారం నెత్తికెక్కద్దు, మెజార్టీలు బాగా రాగానే అవి మనకిచ్చిన ప్రజలను, కార్యకర్తలను తక్కువగా చూడొద్దన్న మాటను కేసీఆర్ తమకు ఎప్పుడూ చెబుతుంటారని గుర్తుచేసుకున్నారు.
గెలుపులో పాఠాలు ఉంటే, ఓటమిలో గుణపాఠాలు ఉంటాయన్న విషయాన్ని మనం ఎప్పటికి గుర్తుంచుకోవాలని అన్నారు. విజయం సాధించగానే ఇంకా మనకు ఎదురు లేదన్న తీరుతో కాకుండా, ప్రజలకి మంచి చేసి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నడవాలని సూచించారు.