ఆలయ ప్రసాదంలో విషం కలిపిన నిందుతుల అరెస్ట్

SMTV Desk 2018-12-20 14:25:38  Temple sweets, Mixing toxics in temple food, 15men died

కర్ణాటక, డిసెంబర్ 20: రాష్ట్రంలోని చామరాజనగర జిల్లా సుళ్యాడి గ్రామంలోని ఆలయం ప్రసాదంలో విషం కలిపిన ఘటనలో 15 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మరో వంద మందికి పైగా భక్తులు ఆస్వస్థతకు గురయ్యారు. ఈసంఘటనకు కారణమైన నలుగురిని కోళ్లేగాల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆలయ ట్రస్టు యాజమాన్యానికి చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారని, ఇందుకోసం వారు 15 బాటిళ్ల పురుగుమందు వినియోగించారని పోలీసులు తెలిపారు.