న్యూ ఢిల్లీ, డిసెంబర్ 20: తాజాగా మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ పది రోజుల్లో చేస్తామని ఇచ్చిన హామీని రాహల్ కేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేయగలిగాం అని అధికారికంగా ట్విటర్ లో వెల్లడించారు.
మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో రైతు రుణమాఫీ ఎజెండాతో కాంగ్రెస్ ప్రచారం జరిగింది. అన్నట్టుగానే కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంది. రుణమాఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ సోమవారం నుంచి రాహుల్ కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసేంతవరకూ ప్రధాని మోదిని నిద్రపోనివ్వం అంటూ మంగళవారం మీడియా వేదికగా రాహుల్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
It's done!
— Rahul Gandhi (@RahulGandhi) December 19, 2018
Rajasthan, Madhya Pradesh & Chhattisgarh have waived farm loans.
We asked for 10 days.
We did it in 2.