రాహుల్ చేసిన పెద్ద తప్పు అదే : అక్బరుద్దీన్ ఒవైసీ

SMTV Desk 2018-12-20 13:00:06  Akbaruddin OYC, Rahul Gandhi, KCR

హైదరాబాద్, డిసెంబర్ 20: ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ వొవైసీ త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 120 సీట్లు గెలుచుకోవడం కూడా కష్టమేనని అన్నారు. ఎంఐఎంను బీజేపీ షీ-టీమ్ గా అభివర్ణించడం... బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నుంచి తాను డబ్బులు తీసుకున్నానని ఆరోపించడం కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ గాంధీ చేసిన పెద్ద తప్పు అని అన్నారు. ఇది ముస్లిం ఓటర్లపై ప్రభావం చూపిందని అన్నారు.


ఈ నేపథ్యంలో, ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందని హంగ్ లోక్ సభ ఏర్పడుతుందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా తాను ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే ఉంటానని చెప్పారు. లోక్ సభ ఎన్నికల కోసం కేసీఆర్ జనవరి నుంచి ప్రచార రంగంలోకి దిగుతారని తెలిపారు.