లక్నో, డిసెంబర్ 19: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ సిఎం, బహుజన సమాజ్ పార్టీ చీఫ్ ఎం మాయావతి జనవరి 15న తన పుట్టినరోజు సందర్భంగా పొత్తు వ్యవహారంపై బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారని ఆపార్టీ వర్గాల నుండి సమాచారం. లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ పొత్తుకు ఇప్పటికే వ్యూహరచన జరుగుతుంది. ఇదే జరిగితే మహాకూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి దెబ్బే తగిలినట్టవుతుంది అని పలు వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే చివరికి మహాకూటమికి ఎదురుదెబ్బ తగలనుందా అని వాపోతున్నారు అక్కడి ప్రజలు.