న్యూ ఢిల్లీ, డిసెంబర్ 19: రేపటి నుండి వరుసగా జనవరి 3 వరకు బిజెపి పార్టీ ఎంపిలతో సమావేశం కానున్న భారత ప్రధాని మోడీ, ఆ పార్టీ చీఫ్ అమిత్షా. ఎంపీలను మొత్తం 12 గ్రూపులుగా బిజిపి విభజించింది. రేపు ఢిల్లీ, చంఢీగఢ్, హరియాణా, హిమాచల్, పంజాబ్, ఉత్తరఖండ్, జమ్మూకశ్మీర్ ఎంపిలతో సమావేశం కానున్నారు. 27న బిహార్, 28న ఏపి, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు. లక్షద్వీప్ ఎంపిలతో మోడి, అమిత్షా సమావేశం అవుతారు. జనవరి 2న మహారాష్ట్ర ఎంపీలతో భేటి కానున్నరు. ఈసమావేశానికి మంత్రులను బాధ్యులుగా బిజెపి నియమించింది.