ప్రభాస్ ఇల్లు సీజ్..!

SMTV Desk 2018-12-19 19:21:59  Prabhas, House Siege

హైదరాబాద్, డిసెంబర్ 19: ప్రముఖ తెలుగు హీరో యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు తన ఇంటిని సీజ్ చేయడంపై హైకోర్టులో ప్రభాస్ పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీర్పుపై ప్రభాస్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు నేడు విచారించనుంది. రాయదుర్గంలోని పాన్ మక్తా గ్రామం సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 సెంట్ల భూమికి సంబంధించి దాదాపు 40 ఏళ్లుగా కోర్టులో ఉన్న కేసులు తొలగిపోవడంతో శేరిలింగంపల్లి తహసీల్దార్‌ ఆ స్థలంను సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో హీరో ప్రభాస్‌ ఇల్లు ఉండటంతో దాన్నీ సీజ్‌ చేశారు.

ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందుతుందని మాల రాములు, నీరుడు లక్ష్మయ్య కోర్టును ఆశ్రయించారు. వీరి వాదనలు విన్న న్యాయస్థానం బాధితులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. భూమిని వారి పేరుపై పట్టా చేయాలని అధికారులను ఆదేశించింది. అందులో ప్రభాస్ ఇల్లు కూడా ఉండడంతో దాన్ని కూడా సీజ్ చేసి నోటీసులు అంటించారు.