అధికారంలోకి రాగానే ఐఏఎస్ ల బదిలీలు

SMTV Desk 2018-12-19 14:39:12  Ashok gehlot, Congress, Rajasthan, BJP, CM

రాజస్థాన్‌, డిసెంబర్ 19: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా కాలం తర్వాత అధికారంలోకి వొచ్చిన వెంటనే తమ తక్షణ కర్తవ్యంగా వెంటనే 40మంది ఐఏఎస్ లను బదిలీలు చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు అశోక్ గెహ్లాట్. ఎన్నికల్లో విజయం సాధించిన సీఎంగా అశోక్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేశారు. ఐఏఎస్ ల బదిలీల కారణంగా ఇప్పటి వరకు పర్యాటక, అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న కుల్దీప్ రంకాను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించుకున్నారు. అలాగే, అజితాబ్ శర్మ, రాజన్ విశాల్‌లను ముఖ్యమంత్రికి సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలుగా నియమిస్తు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు ఆర్ఐఐసీఓ చైర్మన్‌గాను రంకా బాధ్యతలు తీసుకోనున్నారు. కుల్దీప్ రంకా స్థానంలో తన్మయి కుమార్‌ను నియమించింది.