పార్లమెంట్ ఆవరణలో పలు పార్టీ ఎంపీల నిరసన

SMTV Desk 2018-12-19 14:37:21  New delhi, Parliment, Anna DMK, TDP, MP

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 19: పార్లమెంట్ ఆవరణలో పలు కార్యకర్తల నిరసనలు వరుసుగా కొనసాగుతూనే వున్నాయి. అయితే ఈ రోజు ఉదయం నుండి టీడీపీ, అన్నాడీఎంకే ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులను ప్రదర్శించారు. కావేరీ నదిపై అక్రమంగా డ్యామ్‌ను నిర్మిస్తున్నారని, ఆ డ్యామ్‌ను కట్టరాదు అంటూ అన్నాడీఎంకే ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీలు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని వేయాలని కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. బోఫోర్స్‌, 2జీ కేసుల్లో జేపీసీ వేశారని, రాఫెల్ అంశంపై ఎందుకు వేయడం లేదని ఆయన ప్రశ్నించారు.