చైనాలో అనంతపుర వాసి మృతి

SMTV Desk 2018-12-18 19:01:20  China, Shangai, Kolati lokesh, Road accident, Anantapuram

షాంగై, డిసెంబర్ 18: చైనా దేశంలో అనంతపురానికి చెందిన కోలాటి లోకేష్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. షాంగైలో డివైడర్‌ను కారు ఢీకొనడంతో లోకేష్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. లోకేష్ మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. లోకేష్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అధికారులు సహకరించాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. ఇప్పటికే డెడ్‌బాడీ కోసం.. లోకేష్ కుటుంబసభ్యులు ఢిల్లీలో ఏపీ భవన్‌ చుట్టూ తిరుగుతున్నారు.