భారీ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసిన ప్రధాని

SMTV Desk 2018-12-18 19:00:37  Narendra modi, Indian PM, New big pojects, Mumbai

ముంబై, డిసెంబర్ 18: నగరంలో భారత ప్రధాని ఈ రోజు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ముంబై మహానగరంలో సుమారు 33వేల కోట్ల విలువైన మూడు భారీ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ముంబై శివారుల్లోని థానే-బీవండి-కల్యాన్ (మెట్రో 5), దహిసర్‌-మిరాభయండార్‌(మెట్రో 9) రూట్లలో మెట్రోను నిర్మించనున్నారు. దీని కోసం 15 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ నవీ ముంబై టౌన్ ప్లానింగ్ అథారిటీ కోసం కూడా ప్రాజెక్టును మొదలుపెట్టారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందర సుమారు 18 వేల కోట్లతో పేదలకు ఇండ్లు నిర్మించనున్నారు. మోదీ, సీఎం ఫడ్నవీస్‌తో పాటు, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి ఈ మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.