2019 ఐపీఎల్ సీజన్ వేలానికి సిద్దమవుతున్న ఆటగాళ్ళు

SMTV Desk 2018-12-18 13:27:41  2019 IPL, Cricket players Selections, Reachard hyadly

హైదరాబాద్, డిసెంబర్ 18: 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ వేలానికి సిద్దమవుతుంది. దీనికోసం ఆటగాళ్ళ వేలం మంగళవారం జైపూర్‌లో జరగనుంది. గత పదకొండు సీజన్లలో వేలానికి వ్యాఖ్యాతగా వ్యవహారించిన రిచర్డ్ హ్యాడ్లీ స్థానంలో ఈసారి హ్యూస్‌ ఎడ్‌మెయిడాస్‌ వేలం నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,003 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొనడానికి ధరఖాస్తు చేసుకోగా ప్రాంచైజీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 350 మందితో కూడిన తుది జాబితాను ప్రకటించింది. 118 మంది జాతీయ జట్లకు ఆడిన క్రికెటర్లు, 228 మంది దేశవాళీ ఆటగాళ్లు వేలంలో పాల్గొనబోతున్నారు.
వేలంలో 70 మంది ఆటగాళ్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇందులో 20 మంది విదేశీ ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది.