మహారాష్ట్ర పర్యటనకు సిద్దమవుతున్న మోడీ

SMTV Desk 2018-12-18 13:23:38  Indian prime minister, Narendra modi, Maharastra, Metro caridors

ముంబాయి, డిసెంబర్ 18: భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈరోజు మహారాష్ట్ర పర్యటనకు సిద్దమవుతున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని రాష్ట్రంలో రెండు మెట్రో కారిడార్స్‌కు శంకుస్థాపన చేయనున్నారు. థానేభీవండికల్యాణ్ మెట్రో అదేవిధంగా దహిసర్మీరాభయందర్ మెట్రో కారిడార్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ఈడబ్ల్యూఎస్(ఎకనమికల్లీ వీకర్ సెక్షన్), ఎల్‌ఐజీ(లో ఇన్‌కం గ్రూప్) సెక్షన్లకు నిర్మించిన 90 వేల యూనిట్స్‌ను ప్రధాని ప్రారంభిస్తారు.