హైదరాబాద్, డిసెంబర్ 18: ఫ్యాక్షనిస్ట్ గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్య కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు కొద్ది నిమిషాల క్రితం తీర్పునిచ్చింది. చివరికి సూరి హత్య కేసులో భాను కిరణ్ నే దోషి గా తేల్చిన కోర్టు. ఈ కేసులో భాను కిరణ్ పై నేరం రుజువైనందువల్ల అతనికి యావజ్జీవ ఖారఘార శిక్ష, రూ. 20 వేలు జరిమానా విధించింది. అలాగే ఈ కేసులో మరో నిందుతుడైన మన్మోహన్ సింగ్ కి 5 ఏళ్ళు ఖారఘార శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించారు. అలాగే ఈ కేసులో నిందితులుగా ఊహించిన మరో నలుగురిపై కేసు కొట్టేసిన కోర్టు.
2011, జనవరి 3న హైదరాబాద్ యూసఫ్గూడలో సూరి కారులో ప్రయాణిస్తుండగా అతడి అనుచరుడు భాను కిరణ్ కాల్చి చంపాడు. 2012లో భానుకిరణ్ని జహీరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు. భానుతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. సూరి హత్య సమయంలో కారులో భాను, డ్రైవర్ మధు ఉన్నారు. సూరిని భాను చంపినట్టు మధు వాంగ్మూలం ఇచ్చాడు. ఏడేళ్ల పాటు సీఐడీ విచారణ సాగింది.
ఈ కేసులో ప్రధానంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని కోర్టులో విచారణ జరిగింది. కాల్చి చంపింది భాను కిరణేనని సూరి కారు డ్రైవర్ మధు ఇచ్చిన వాంగ్మూలం, ప్రధాన నిందితుడి నుంచి సేకరించిన తుపాకీకి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు, ఈ హత్యకు సంబంధించి భానుకిరణ్కి మిగిలిన నిందితులకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆధారంగా విచారణ పూర్తి చేసినట్టు సమాచారం. సూరి హత్య కేసులో ఆరుగురి పేర్లను పోలీసులు ఛార్జిషీట్లో చేర్చారు. 92మంది సాక్షులను విచారించారు. ఆయుధాల అక్రమ రవాణా కేసులో భాను కిరణ్తో పాటు మరో ముగ్గురికి హైదరాబాద్లోని స్థానిక కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించిన విషయం విదితమే. సూరి హత్య కేసులో భాను, మన్మోహన్ సింగ్, సుబ్బయ్య, లోకనాథ్, వెంకటరమణ, హరిబాబులు నిందితులుగా ఉన్నారు.