ముంబాయి, డిసెంబర్ 17: అంధేరీ ప్రాంతంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వొకరు మృతి చెందగా, 47మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. 10 అగ్ని మాపక దళాలు, 16 అంబులెన్స్ లు ఘటనా స్థలంలోనే ఉన్నాయి.
మూడో అంతస్తులో మంటలు వ్యాపించడంతో విపత్తు నిర్వహణ సిబ్బంది గోడలను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఆసుపత్రిలోని రోగులు, మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.