న్యూ ఢిల్లీ, డిసెంబర్ 17: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి రెండు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇవాళ ప్రకటించింది. యువ క్రికెటర్ పృథ్వీ షా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం నుంచి తిరిగి కోలుకోకపోవడంతో అతడికి విశ్రాంతినిచ్చారు. షా స్థానంలో టీమ్లోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ ఓపెనర్గా బరిలో దిగే ఛాన్స్ ఉంది. రెండో టెస్టులో భారత్ ఓటమి దిశగా సాగుతుండటంతో తదుపరి టెస్టుకు టీమ్ మేనేజ్మెంట్ జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. మూడో టెస్టు డిసెంబర్ 26న మెల్బోర్న్లో ప్రారంభంకాగా..జనవరి 3న ఆరంభంకానున్న ఆఖరిదైన నాలుగో టెస్టుకు సిడ్నీ ఆతిథ్యమిస్తోంది. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తొలి టెస్టులో గెలిచిన కోహ్లీసేన 1-0తో ఆధిక్యంలో ఉంది.
ఇండియా టీమ్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, పుజారా, రహానె, విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థీవ్ పటేల్, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్