న్యూ ఢిల్లీ, డిసెంబర్ 17: నగరంలోని ద్వారకా ప్రాంతానికి చెందిన ఓ అపార్ట్మెంట్లో మూడేళ్ళ చిన్నారి అత్యాచారానికి గురైంది. పోలీసుల కథనం ప్రకారం ఇంటికి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న రంజీత్ ఆ ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరిగే బాలికపై కన్నేసాడు. ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో తనపై అత్యచారనికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక ఏడుపును గమనించిన స్థానికులు రంజీత్కు దేహశుద్ధి చేశారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మరోవైపు ఈ అత్యాచార ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ ఫైర్ అయ్యారు. నిర్భయ ఘటన చోటు చేసుకుని ఆరేళ్లైనప్పటికీ దేశ రాజధానిలో ఇంకా బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని స్వాతి మండిపడ్డారు.