హైదరాబాద్, డిసెంబర్ 17: టాలీవుడ్ సంచలన యువ నటుడు విజయ్ దేవరకొండ సినిమాల్లోనే కాకుండా ప్రకటనల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఈ మధ్య కె.ఎం.ఎల్ ఫ్యాషన్, సంగీతా మొబైల్స్, ఐటిసి లాంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ అయిన ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండింగ్ సేల్ ఆఫర్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం అర్జున్ రెడ్డి తో పాటు క్రేజీ బ్యూటీ అక్కినేని సమంతతో స్పెషల్ యాడ్స్ ప్లాన్ చేశారు.
వీరిద్దరూ ఇదివరకు మహానటి సినిమాలో ఆంటోనీ, మధురవాణిలుగా నటించారు. వీళ్ళ ప్రేమకథ ఆ సినిమాలో అదనపు ఆకర్షణగా మారింది. అయితే ఈ సినిమా తర్వాత విజయ్, సమంతలు కలిసి నటించే అవకాశం రాలేదు.