రైల్వే కోర్టుకు హాజరైన మంత్రులు

SMTV Desk 2017-07-26 14:42:18  MINISTERS, RAIL ROKO, RAILWAY POLICE

సికింద్రాబాద్, జూలై 26 : తెలంగాణ ఉద్యమంలో భాగంగా రైల్ రోకో నిర్వహించిన కేసులో మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు ఈరోజు సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. 2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో మౌలాలీ రైల్వే జంక్షన్ వద్ద రైల్ రోకో చేశారని రైల్వే పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా విచారణకు సాక్షులు హాజరు కాని కారణంతో ఈ కేసును వచ్చే నెల 21కి వాయిదా వేశారు.